ఇదే నిజం, నార్నూర్: అదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వైద్య సిబ్బంది ORS ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆశా వర్కర్లతో కలిసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ అనిత, హిమబిందు, ఫీల్డ్ అసిస్టెంట్ మోతిరామ్, సురేష్, సాహెబ్రావు, వినోద్, కూలీలు, తదితరులు పాల్గొన్నారు.