eSIM పూర్తి పేరు ఎంబెడెడ్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది వర్చువల్ సిమ్ కార్డ్. ఇది ఫోన్లోనే ఉంటుంది. స్మార్ట్ఫోన్లే కాకుండా, స్మార్ట్వాచ్లు టాబ్లెట్లు, ఇతర ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన పరికరాలలో కూడా eSIM సాంకేతికత ఉపయోగించవచ్చు. ఫిజికల్ సిమ్లా కాకుండా, ఫోన్ నుంచి దీన్ని తీసివేయడం సాధ్యం కాదు. ఇది దొంగతనం విషయంలో ట్రాకింగ్ సులభతరం చేస్తుంది. స్మార్ట్ ఫోన్ డిజైన్ లో బ్యాటరీ మాదిరిగా ఇతర ఫీచర్ల కోసం స్థలం ఉంది. QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా eSIM కొన్ని నిమిషాల్లో యాక్టివేట్ అవుతుంది. Apple, Samsung, Google Pixel, ఇతర ప్రధాన బ్రాండ్ల ప్రీమియం స్మార్ట్ఫోన్లలో eSIM మద్దతు అందుబాటులో ఉంది. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) వంటి భారతదేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు eSIM సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ పక్రియ పూర్తి చేయడానికి, వినియోగదారు తన నెట్వర్క్ ప్రొవైడర్ ను సంప్రదించాలి. eSIM సాంకేతికత భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్లు, ఇతర పరికరాలకు పెద్ద విప్లవంగా మారవచ్చు.
ALSO READ: Countries : ప్రపంచంలోనే అత్యధిక పని గంటలు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే.. భారతదేశం ఏ స్థానంలో ఉందంటే..!