ఏపీ ప్రభుత్వం రూ. 1.15 లక్షల విలువైన సోలార్ ప్యానల్స్ను పూర్తిగా ఉచితం అందిస్తారు. ఎస్సీ, ఎస్టీల కోసం పథకాలను అమలు చేస్తోంది. ఇటీవల కేంద్ర పథకాన్ని విలీనం చేస్తూ వారి కోసం మరో పథకాన్ని తీసుకువచ్చింది. పీఎం సూర్యగఢ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ను అందిస్తున్నారు. రూ.1.15 లక్షల విలువైన ఈ సోలార్ ప్యానెల్స్ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. పీఎం సూర్యగఢ్ పథకం కింద కేంద్రం రూ.60 వేలు సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన రూ.55 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.