Homeహైదరాబాద్latest Newsబర్త్​ డే పార్టీలో డ్రగ్స్

బర్త్​ డే పార్టీలో డ్రగ్స్

– సనత్​నగర్​లో ఐదుగురు యువకులు అరెస్ట్
– 4 గ్రాముల ఎండీఎంఏ, ఓసీబీ ఫ్లేవర్స్​ స్వాధీనం
– గోవాలో డ్రగ్స్ కొన్నట్లుగా గుర్తించిన పోలీసులు


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బర్త్​ డే పార్టీలో డ్రగ్స్ వాడిన ఐదుగురు యువకులను రాజేంద్రనగర్​ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పుట్టిన రోజు పార్టీలో యువకులు డ్రగ్స్ వినియోగించి.. మత్తులో మునిగారు. గోవా (Goa) నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు యువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సనత్ నగర్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి, ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్‌తో పాటు 5 మొబైల్స్ సీజ్ చేశారు.

గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

మరోవైపు దుండిగల్ పీఎస్ పరిధిలో మేడ్చల్ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి పట్టుకున్నారు. ఒరిస్సాకు చెందిన రంజాన్ దాస్, కేశవ్ కౌర్, కె.గంగా హైదరాబాద్​లో ఉంటూ కార్మికులుగా పనిచేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఈ ముగ్గురు గంజాయి దందా చేస్తున్నారు.
ఆ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 33 వేల 750 విలువ గల 1.35 కేజీల గంజాయిని సీజ్ చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదన ఆశతో ఈ ముగ్గురు గంజాయి దందా చేస్తున్నారు. ఒరిస్సాకు చెందిన కార్మికులు రూ. 7 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ. 15 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Recent

- Advertisment -spot_img