Homeహైదరాబాద్latest NewsBREAKING: పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి

BREAKING: పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి

కృష్ణా జిల్లా గంగూరులో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. అయితే పెన్షన్ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలికి వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయింది. గంగూరుకు చెందిన వజ్రమ్మ (80) ఉదయం పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్లింది. వడదెబ్బతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అలాగే అమలాపురం జిల్లా పేరూరులో ఓ వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు.

Recent

- Advertisment -spot_img