తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాల ప్రారంభానికి బ్రేక్ పడింది. పాత పథకాలు యథావిధిగా అమలు కానున్నాయి. ఈ నెల 26న ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఫిబ్రవరి 27న 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.