Homeహైదరాబాద్latest NewsBJP లో‌కి మాజీ Cricketer! ఎవరి పోటీ ఎక్కడి నుంచి?

BJP లో‌కి మాజీ Cricketer! ఎవరి పోటీ ఎక్కడి నుంచి?

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కేంద్రంలోని బీజేపీ.. మూడోసారి అధికారం లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. బీజేపీకి 370 సీట్లు.. ఎన్డీఏ కూటమి మొత్తం 400 లపైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో పావులుకదుపుతోంది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు బీజేపీలో చేరుతారన్న వార్త సంచలనంగా మారింది. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మళ్లీ కాషాయ పార్టీలోకి వస్తారనే ప్రచారంతోపాటు.. యువరాజ్ సింగ్‌ సైతం బీజేపీలో చేరుతారన్న విషయం సంచలనంగా మారింది. గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్‌ను పోటీకి దింపాలని కాషాయ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధూ.. అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉన్నందున, ఆ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి గెలుపు ఖాయమని సిద్ధూను ఆ స్థానం నుంచి బరిలోకి దించవచ్చని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img