ఝార్ఖండ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తొలుత ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా క్రమంగా ఇండియా కూటమి పుంజుకుంది. ప్రస్తుతం ఇండియా కూటమి 51, ఎన్డీయే 28 స్థానాల్లో లీడ్లో ఉంది. మహారాష్ట్ర ఫలితాల్లో మహాయుతి ఆధిక్యం కొనసాగుతోంది. మహారాష్ట్రలో మహాయుతి 218, ఎంవీఏ 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.