Homeహైదరాబాద్latest Newsసంగారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆరుగురు మృతి

సంగారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆరుగురు మృతి

Sangareddy : హత్నూర మండలం చందాపూర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు బిహార్‌కు చెందిన ఐదుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. ఎస్బీ పరిశ్రమ మేనేజర్ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలుడు ధాటికి పలువురు కార్మికులు ఎగిరిపడ్డారు. మరో రియాక్టర్‌కు మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img