Homeతెలంగాణరైతు కళ్లలో ఆనందమే కేసీఆర్ లక్ష్యం

రైతు కళ్లలో ఆనందమే కేసీఆర్ లక్ష్యం

వనపర్తి : రైతు కళ్లలో ఆనందమే కేసీఆర్ లక్ష్యం అన్నారు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్​ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి. పెద్దగూడెం లిఫ్ట్ మోటార్లు ప్రారంభించి ఖాన్ చెరువుకు చేరిన నీటితో గ్రామంలోని కోదండరామస్వామికి అభిషేకం నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు సతీసమేతంగా మంత్రి. అనంతరం మెంటెపల్లి గ్రామ పరిధిలోని రాఘవేంద్రనగర్ లిఫ్ట్​ను ప్రారంభించి 50 ఎకరాలకు నీళ్లందించే రాసాలకుంటలో కృష్ణానీళ్లకు పూజచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కృష్ణా నది నీళ్లతో ఖాన్ చెరువు నింపాలని దీక్షతో పనిచేశామన్నారు. రాబోయే రోజులలో ఖాన్ చెరువుకు ఇక కరువుండదు అని, జూరాల నిండితే ఖాన్ చెరువు నిండినట్లేనన్నారు. దీంతో 1500 ఎకరాలకు సాగునీరు అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. రూ.79 లక్షలతో లిఫ్ట్ ఏర్పాటు చేశామని, గ్రామస్తులు కమిటీగా ఏర్పడి దీనిని జాగ్రత్తగా నడుపుకోవాలన్నారు. చెరువుకింద పంటలు పండిన తరువాత రైతులు గ్రామ దేవతల పేరు మీద అన్నదానం నిర్వహించాలని మంత్రి సూచించారు. లిఫ్ట్ నిర్మాణానికి సహకరించిన, పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి. రైతులు సాంప్రదాయ పంటలు విడిచిపెట్టాలని మంత్రి సూచించారు. తెలంగాణలో కొన్ని సీజన్లలో కొత్తిమీర, పుదీన, టమాట, మిరపకాయ్ వంటివి దొరకడం లేదని, ఎండాకాలం, వానాకాలంలలో రెండు పంటలపై మాత్రమే రైతులు ఆధారపడొద్దని, దొరకని వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతుల కోసం ఉచిత కరంటు ఇస్తున్నామని, సాగునీరు వస్తుందని, ఏడాదికి నాలుగు పంటలు తీసే అవకాశం ఉందన్నారు మంత్రి. నూతన వ్యవసాయ ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేస్తామని అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img