Homeహైదరాబాద్latest Newsగొల్లపల్లిలో రైతు రుణమాఫీ సంబరాలు

గొల్లపల్లిలో రైతు రుణమాఫీ సంబరాలు

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు ఈ రోజు గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మొదటి దఫా రైతు రుణమాఫీనీ చేస్తున్నందుకు గాను స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి రైతు వేదిక వరకు బైక్ ర్యాలీగా బయలుదేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని రైతు వేదిక ముందు రుణమాఫీ చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి,ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి పాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి రైతులతో కలిసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు భీమా సంతోష్,ఎంపిడిఓ రామ్ రెడ్డి,AEO అశ్విని,మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్,రేవెల్ల సత్యనారాయణ గౌడ్,సరసాని తిరుపతిరెడ్డి,పురంశెట్టి వెంకటేష్,మాజీ ఎంపిటిసి లంబ లక్ష్మణ్,మాజీ ఉపసర్పంచ్లు కొండ వెంకటేష్ గౌడ్,ఆవునూరు శ్రీధర్,కస్తూరి హరికిరాన్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరెళ్ల మహేష్,యూత్ అధ్యక్షులు ఓరుగంటి తిరుపతి,సరసానీ సామిరెడ్డి,గడ్డం తిరుపతి రెడ్డి,గురజాల రాజిరెడ్డి,జేరిపోతుల కొమురయ్య,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెవెల్లె లింగన్న,రాజేశ్వర రావు,నెరెల్ల రాజిరెడ్డి,ఎల్లలా లింగారెడ్డి,దాసరి తిరుపతి గౌడ్,కాశ గంగాధర్,లచ్ఛయ్య,చెవులమద్ది గంగాధర్,తడగొండ విజయ్,సుద్దాల శేఖర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img