ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మసీలో ఘోర ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలోని ఠాగూర్ లేబొరేటరీలో విషవాయువు లీక్ కావడంతో 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళనకు గురైన తోటి కార్మికులు వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.