ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కారును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి హమీర్పుర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.