రాజస్థాన్లోని దౌసాలో రాజస్థాన్-ముంబై హైవేపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి హరిదర్ వెళ్తుండగా వీరి కారుకు ఎదురుగా ఓ ఆవు రావడంతో.. రోడ్డు పక్కన తమ కారును ఆపి రోడ్డుపై నిలబెట్టారు. ఆ సమయంలో వెనుక నుంచి లారీ వారిని బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.