Homeహైదరాబాద్latest Newsదగ్గుబాటి వెంకటేశ్​, రానాపైకేసు పెట్టండి

దగ్గుబాటి వెంకటేశ్​, రానాపైకేసు పెట్టండి

– నాంపల్లి కోర్టు ఆదేశం

ఇదేనిజం, హైదరాబాద్​: సినీ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్​, రానాపై కేసు పెట్టాలని నాంపల్లి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఫిలింనగర్‌ డెక్కన్‌ కిచెన్‌ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. డెక్కన్‌ కిచెన్‌ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను దిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి.. ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ క్రమంలో వెంకటేశ్​, ఇతర కుటుంబ సభ్యులపై ఐపీసీ 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img