Homeజిల్లా వార్తలుమలబార్ గోల్డ్ అండ్ డైమండ్ లో ఆర్టిస్ట్రీ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించిన సినీనటి శరణ్య

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ లో ఆర్టిస్ట్రీ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించిన సినీనటి శరణ్య

ఇదేనిజం, శేరిలింగంపల్లి: ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ చందానగర్ శాఖలో ఆర్టీస్ట్రి జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శనను గురువారం ప్రముఖ సినీనటి ఫిదా మూవీ ఫ్రేమ్ శరణ్య మేనేజ్మెంట్ మెంబర్స్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ.. ఇండియా, సింగపూర్ తో పాటు ప్రపంచ దేశాల్లో 350 పైగా షోరూమ్లను విస్తరించుకొని విజయవంతంగా నిర్వహించబడుతున్న ఏకైక జువెలరీ బ్రాండ్ మలబార్ గోల్డ్ అన్నారు. ఎప్పటికప్పుడు నూతన డిజైన్లతో అతివేగంగా అభివృద్ధి సాధిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ తమ వార్షిక ఆదాయంలో కొంత వాటాను సామాజిక బాధ్యత రూపంలో ఆరోగ్యం ,ఉచిత విద్య ,నిరుపేదలకు గృహ నిర్మాణ, మహిళా సాధికారత, పర్యావరణం పరిరక్షణ కోసం తన వంతు సాయం అందిస్తుందన్నారు చందానగర్ మలబార్ శాఖలో జూలై 25 నుండి 28 వరకు ఆర్టిస్ట్రీ జువెలరీ ప్రదర్శన నిర్వహించబడుతుందని తెలిపారు. చందానగర్ శాఖ నిర్వాహకులు దీపక్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ జువెలరీ పైన కొనుగోలుదారులకు 25 శాతం డిస్కౌంట్ ప్రత్యేకంగా ఇవ్వబడుతుందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img