ఫార్ములా ఈ రేసు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఫార్ములా భాగస్వామికి, బీఆర్ఎస్ మధ్య రూ.41 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీఆర్ఎస్కు గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థల నుంచి 41 సార్లు ఎన్నికల బాండ్ల రూపంలో చెల్లింపులు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు కేసు విచారణను వేగవంతం చేశారు.