Homeహైదరాబాద్latest Newsవేమనపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వేమనపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఇదేనిజం, వేమనపల్లి: మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేపట్టారు. మండలంలోని చామనపల్లి గ్రామ పంచాయతీలో రూ. 21 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వేమనపల్లి మండల జెడ్పీటీసీ దంపతులు రుద్రబట్ల స్వర్ణలత సంతోశ్​ కుమార్ వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నో ఏండ్ల తర్వాత చామనపల్లి గ్రామ ప్రజల కల నెరవేరబోతుందని చెప్పారు. తమ కూతురు ఎలెక్షనులో ఇచ్చిన హామీ మేరకు గ్రామ అభివృద్ధి చేయడం జరుగుతుందని సాధ్యమైనంత తొందరలో వంతెన పనులు పూర్తి చేసి ప్రజల రవాణా సమస్యను తొలగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు చామనపల్లి గ్రామ ప్రజలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img