ఇదే నిజం,గొల్లపల్లి : ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో మధుమేహం,బిపి ,కంటి పరీక్షలు,దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది.అవసరమున్న వారికి గుండె పరీక్షలకు ఈసీజీ చేయడం జరిగింది.ప్రతి ఒక్కరికి అవసరం మేరకు మందులను ఉచితంగా అందించడం జరిగింది.ఈ వైద్య శిబిరంలో దాదాపు 277 మంది గ్రామస్తులు వైద్య సేవలను అందుకున్నారు. ఈ శిబిరాన్ని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మృదుల, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సుధీర్, డాక్టర్ ఆర్ ప్రశాంత్ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ , మాజీ సర్పంచ్ సిద్ధంకి మల్లారెడ్డి,మాజీ ఎంపీటీసీ గోస్కుల రాజన్న,మాజీ ఉపసర్పంచ్ బీరకిషోర్,భీమా సత్తన్న ,అవారి చందు,యువజన సంఘ సభ్యులు,వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.