Homeతెలంగాణస్ట్రాంగ్​ రూమ్​ల వద్ద ఫుల్​ సెక్యూరిటీ

స్ట్రాంగ్​ రూమ్​ల వద్ద ఫుల్​ సెక్యూరిటీ

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్​ల వద్దకు తరలించారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎం మెషిన్లను భద్రపరిచారు. దీంతో స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకు ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు.

Recent

- Advertisment -spot_img