గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 2న సాయంత్రం 5 గం.లకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది.