Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ''గేమ్ ఛేంజర్'' సినిమా టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?

తెలంగాణలో ”గేమ్ ఛేంజర్” సినిమా టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?

తెలంగాణలో ”గేమ్ ఛేంజర్” సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ”గేమ్ ఛేంజర్”. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది.ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన సంధ్య థియేటర్ సంఘటనతో, సీఎం రేవంత్ రెడ్డి ఇకపై టికెట్ రేట్లు పెంచమని అన్నారు. అలాగే బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇవ్వమని తెలిపారు. అయితే ఈ సినిమా టికెట్ రేట్ల పెంచమని నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో సీఎం టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి 10న, మొదటి రోజు ఉదయం 4 గంటల నుండి ఆరు ప్రదర్శనలకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లలో 150 మరియు మొదటి రోజు సింగిల్ స్క్రీన్‌లలో 100 పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. జనవరి 11 నుండి 19 వరుకు 5 ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడం ద్వారా మల్టీప్లెక్స్‌లలో 100 మరియు సింగిల్ స్క్రీన్‌లలో 50 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img