హైదరాబాద్: రాష్ట్రానికే తలమానికమైన గాంధీ హాస్పిటల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దుర్గంధభరితంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తించిన తర్వాత గాంధీని కేవలం కోవిడ్ ట్రీట్మెంట్కు సఫరేటుగా కేటాయించారు. దాంతో అటూ వెళ్లేందుకు కూడా శానిటైజ్ సిబ్బంది సైతం జంకుతున్నారు. ఫలితంగా ఏ వార్డులో చూసిన అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. ఇటీవల కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకోని ప్రభుత్వం అన్ని హాస్సిటల్స్ లో అగ్ని మాపక యంత్రాలను చెక్ చేయాలని చెప్పినా అధికారులు గాంధీ వైపు చూడలేదు. చాలా వార్డుల్లో ఫైర్ యంత్రాలు పనికిరాకుండా దర్శనమిస్తున్నాయి. నిత్యం వాటిని చూసుకుంటూనే అధికారులు పోతారు తప్పితే వాటిని పట్టించుకున్న పాపాన పోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది.
బాత్రూమ్లో అడుగు పెట్ట వీలు లేదు
కోవిడ్ వార్డుల్లోనూ టాయిలెట్స్ లో అపరిశుభ్రత అధికంగా ఉందని, కనీసం రోజుకు ఒక్కసారైనా క్లీన్ చేసే వారు కరువయ్యారని గతంలో వీడియోలను కోవిడ్ బాధితులు విడుదల చేయడం మనం ఇంకా మర్చిపోలేదు. సాధారణ రోజుల్లోనే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయంటే ఇక వర్షాకాలంలో పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతా బాగానే ఉందని ఓ పక్క వైద్యాధికారులు, మరోపక్క ప్రభుత్వం పైకి ప్రకటనలు చేస్తున్న వాస్తం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. మరో గత్యంతరం లేక భరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు, ప్రభుత్వం గాంధీలో పారిశుధ్యంపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.





