హైదరాబాద్: నగరంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులపై జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. కూకట్పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్కు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాజాగా 4 లక్షల జరిమానా విధించారు. గతంలోనూ అనేక సార్లు ఫైన్లు వేసినా మాల్ తీరు మారడం లేదని అధికారులు చెప్పారు. దీంతో సుజనా మాల్స్కు ఇప్పటి వరకు 16 లక్షల 50వేల జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అలాగే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కు రూ. 2 లక్షలు, బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్కు రూ.2 లక్షల జరిమానా విధించారు.
రూల్స్ పట్టని సుజనా ఫోరమ్ మాల్.. తాజాగా రూ.4లక్షల ఫైన్
RELATED ARTICLES