Homeహైదరాబాద్latest Newsబర్త్‌డే కేక్ తిని బాలిక మృతి

బర్త్‌డే కేక్ తిని బాలిక మృతి

పంజాబ్​‌లో షాకింగ్​ ఘటన జరిగింది. బర్త్‌డే కేక్ తిని అనారోగ్యంతో బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటియాలాకు చెందిన పదేళ్ల బాలిక బర్త్​డే కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది. బాలికకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్‌​గా మారింది.

ఈ నెల 24న బాలిక పుట్టిన రోజు జరుపుకున్న కుటుంబ సభ్యులు, ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా కేక్ ఆర్డర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేక్ తిన్న కొన్ని గంటల్లోనే కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని చెప్పారు. బర్త్ డే గర్ల్ తో పాటు నలుగురు కుటుంబ సభ్యులు వరుసగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత బాలిక నిద్రలోకి జారుకుంది. మార్చ్​ 25 తెల్లవారుజామున అపస్మారక స్థితిలో కనిపించింది. ఉదయం కుటుంబ సభ్యులు కోలుకోగా, బాలికను సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖరార్‌​లోని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ అధికారి వరుణ్ శర్మ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేక్ ఆర్డర్ చేసిన రెస్టారెంట్ యజమానిని అరెస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img