– ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి హెచ్చు వెంకటేశ్వర్లు వినతి
ఇదే నిజం,నెల్లికుదురు: తనకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హెచ్చు వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సోమవారం హెచ్చు వెంకటేశ్వర్లు హైదరాబాదులో నరేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తన బయోడేటాను అందజేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేశానని.. ఎంపీ టికెట్ ఇచ్చేటప్పుడు తన పేరును కూడా పరిశీలించాలని కోరారు.