గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢ బోనాల సందడి నెలకొంది. మహిళలు బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తీన్మార్ దరువులు, డప్పుల చప్పుడుఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. పోతరాజుల వీర విన్యాసాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభాయమానంగా సాగింది. ఈరోజు తొలిపూజ కావడంతో ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.