Homeహైదరాబాద్latest Newsజాతీయ అస్ట్రోనమీ, సైన్స్ ఒలింపియాడ్లో బంగారు పతకాలు

జాతీయ అస్ట్రోనమీ, సైన్స్ ఒలింపియాడ్లో బంగారు పతకాలు

– అల్ఫోర్స్ విద్యార్థులకు చైర్మన్ అభినందనలు

ఇదేనిజం, కరీంనగర్: జాతీయ అస్ట్రోనమీ, సైన్స్ ఒలింపియాడ్లో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ–టెక్నో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థలు బంగారు పతకాలు సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆ విద్యార్థులకు అభినందన సభ నిర్వహించగా, చైర్మన్ హాజరై మాట్లాడారు. ఇటీవల కాలంలో ప్రముఖ పోటీపరీక్షల సంస్థ ‘నవార్స్ ఎడ్యుటెక్’ నిర్వహించిన ‘అష్ట్రనావి సైన్స్–మ్యాథ్స్ ఒలిపియాడ్ లో పాఠశాలకు చెందిన కే సుచిత్ రెడ్డి(5వ తరగతి), ఎస్పీ క్రిష్ణ చైతన్య(6వ తరగతి) మొదటి దశలో చాలా అద్భుతంగా రాణించారని, రెండో దశకు కూడా ఎంపికయ్యారని హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు విజేతలకు పుష్పగుచ్ఛాలు అందజేసి, భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img