జగదాంబ మహాకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈనెల 14, 18, 21, 25, 28, ఆగస్టు-1, 4 తేదీల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు.