రైతుల కోసం ధరణి కొత్త యాప్, కొత్త చట్టం తెస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా HYDలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ధరణి పోర్టల్ నిర్వహణను ఈ నెల ఒకటో తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్ఐసీకి మార్చాం. 2020 ఆర్వోఆర్ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్వోఆర్ చట్టం తెస్తున్నాం. కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తాం’ అన్నారు.