ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అసెంబ్లీ వేదికగా కొత్త పింఛన్ల జారీని ప్రకటించింది. డిసెంబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆన్లైన్ విధానంతో పాటు వార్డులు, గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా కొత్త పింఛన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు గత ప్రభుత్వంలో చాలా మంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేసినట్లు తేలింది. ఈసారి కొత్త పింఛన్ల ఎంపికలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించింది. జనవరిలో జరిగే జన్మభూమి-2 కార్యక్రమంలో కొత్త పింఛన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.