Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు శుభవార్త.. ఏపీలో ఆ ధరకే క్వార్టర్ మద్యం బాటిల్…!

మందుబాబులకు శుభవార్త.. ఏపీలో ఆ ధరకే క్వార్టర్ మద్యం బాటిల్…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. సోమవారం నాటికి 20 వేల కేసుల మద్యం సీసాలు చేరుకుంటాయన్నారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ బాటిళ్ల మద్యం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా క్వార్టర్ బాటిల్ మద్యం రూ.99కి అందుబాటులోకి వచ్చింది. మద్యం విక్రయాల్లో జాతీయ ఖ్యాతి గడించిన 5 కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకే మద్యం విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గురువారం నాటికి రూ.99 మద్యం పదివేల కేసులు మార్కెట్‌కు చేరాయి.దశలవారీగా సరఫరా పెంచడం ద్వారా ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో 2,40,000 కేసుల మద్యం అందుబాటులోకి వస్తుందన్నారు.

Recent

- Advertisment -spot_img