తెలంగాణ లో రుణమాఫీ, రైతు భరోసా ల కోసం రైతులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిందే. అయితే రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 4 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. నాలుగో విడత రూ. 2,747.67 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకే రేషన్కార్డు కలిగి ఉండి కుటుంబంలో ఇద్దరు రుణమాఫీ అర్హత ఉన్న వారికి ఇప్పటి వరకు కాలేదని రైతులు పేర్కొంటున్నారు. మాకూ త్వరగా రుణమాఫీ విడుదల చేయాలని కోరుతున్నారు. మిగిలిన రైతులకు ఐదో విడతకు అందించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.