హైదరాబాద్లో మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (MMTS) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిటీ పరిధిలో 102.4 కి.మీ. పొడవున ఆరు మార్గాల్లో కొత్త రైల్వేలైన్లు ఏర్పాటు చేయనుంది. అలాగే ఫలక్ నుమా-ఉందానగర్ వంటి ప్రాంతాల్లో డబ్లింగ్ నిర్మాణాలను చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ విస్తరణ పనుల కోసం దాదాపు రూ. 1,169 కోట్ల అంచనా వ్యయాన్ని కేంద్రం కేటాయించింది. ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల పార్లమెంట్లో ప్రకటించారు.
హైదరాబాద్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-ఫలక్నుమా.. ఇతర ప్రధాన మార్గాల్లో అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఉదయం మరియు సాయంత్రం వేళల్లో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు, ఇతర ప్రయాణికులకు కొంతమేర రద్దీ తగ్గి ఊరట లభించింది.
ప్రధాన మార్గాలు:
- ఘట్కేసర్-మౌలాలి
- ఫలక్నుమా-ఉమ్దానగర్
- సనత్నగర్-మౌలాలి
- తెల్లాపూర్-రామచంద్రాపురం
- మేడ్చల్-బొల్లారం మార్గాల్లో అభివృద్ధి పనులు జరగనున్నాయి.
- మేడ్చల్-బొల్లారం మధ్య 14 కిలోమీటర్ల డబ్లింగ్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
- సికింద్రాబాద్-బొల్లారం మధ్య 15 కిలోమీటర్ల రైల్వే లైన్ను విద్యుదీకరించనున్నారు.
ఈ పనులన్నీ పూర్తయితే నగరంలోని అనేక ప్రాంతాలకు ఎంఎంటీఎస్ సేవలు విస్తరించడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. నగరంలో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది.