కాంగ్రెస్ ప్రజాపాలనలో రవాణా శాఖ పనితీరు అత్యుత్తమంగా ఉందని ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ శాఖ 2024లో సాధించిన పురోగతి నివేదికను ఆయన మంగళవారం వెల్లడించారు. ‘ఏడాది పాలనలో అనేక సంస్కరణలు అమలు చేశాం. మార్చిలోపు రాష్ట్రవ్యాప్తంగా 799 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెడతాం. వాటిలో హైదరాబాద్కు 353, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేటలకు 446 బస్సులను కేటాయిస్తాం’ అని తెలిపారు.