వరుస సెలవుల నేపథ్యంలో ప్రజలంతా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ప్రయాణం అవుతున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లలోనూ ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. వరలక్ష్మీ వ్రతం, శనివారం, ఆదివారం, ఆగస్టు 19న రాఖీ ఉండటంతో వరుస సెలవులు వచ్చాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతోపాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 8 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది.