రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నుంచి 6 కిలోల బియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. రాష్ట్రంలోని 84 శాతం మందికి బియ్యం సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు. మార్చి 30న హుజూర్నగర్లో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన అన్నారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నానున్నారు.