Homeహైదరాబాద్latest Newsదేశప్రజలకు గుడ్​ న్యూస్​.. కొత్త స్కీమ్​ ప్రకటించిన మోడీ

దేశప్రజలకు గుడ్​ న్యూస్​.. కొత్త స్కీమ్​ ప్రకటించిన మోడీ

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో : ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఢిల్లీ వెళ్లిన మోడీ ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకంపై మంత్రులు, అధికారులతో చర్చించి, ‘ఎక్స్‌’ వేదికగా వివరాలను ప్రధాని ప్రకటించారు. ‘సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ నిరంతరం శక్తిని పొందుతుంటారు. సోమవారం అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన శుభ సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలన్న నా సంకల్పం మరింత బలపడింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయబోతున్నాం’ అని మోడీ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజల కరెంట్​ బిల్లులను తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారత్‌ స్వావలంబన దిశగా పయనించేందుకు దోహద పడుతుందని ప్రధాని పేర్కొన్నారు

Recent

- Advertisment -spot_img