Homeహైదరాబాద్latest Newsఏపీ ప్రజలకు శుభవార్త.. చంద్రన్న బీమా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు..!

ఏపీ ప్రజలకు శుభవార్త.. చంద్రన్న బీమా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు..!

ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త తెలిపింది. చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామన్నారు. YCP ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతో మందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు కార్మికశాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం అందుతుందన్నారు.

Recent

- Advertisment -spot_img