Homeఆంధ్రప్రదేశ్ఏపీ ప్రజలకు శుభవార్త.. సరికొత్త విమాన సర్వీసులు ప్రకటించిన ప్రభుత్వం.. కొత్త రూట్లు ఇవే..!

ఏపీ ప్రజలకు శుభవార్త.. సరికొత్త విమాన సర్వీసులు ప్రకటించిన ప్రభుత్వం.. కొత్త రూట్లు ఇవే..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విమాన సేవలను విస్తరించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కొత్త విమాన సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 12 నుంచి విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య, జూన్ 13 నుంచి విశాఖపట్నం-అబుదాబి మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ వారానికి నాలుగు రోజులు విమాన సర్వీసులను నడుపనుంది. అలాగే, జూన్ 2 నుంచి విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా విమానాలు నడవనున్నాయి. ఈ కొత్త సర్వీసులతో రాష్ట్రంలో విమాన రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని, ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Recent

- Advertisment -spot_img