Homeహైదరాబాద్latest NewsGood News: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..

Good News: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..

హైదరాబాద్ వాసులకు మెట్రో అధికారులు ఓ శుభవార్త అందించారు. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఇవాళ ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు వేళలను పొడిగించారు. నాగోల్‌, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఐపీఎల్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగినా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Recent

- Advertisment -spot_img