HomeతెలంగాణGoverner:రక్తదానాన్నిప్రోత్సహించండి-గవర్నర్ డాక్టర్ తమిళిసై

Governer:రక్తదానాన్నిప్రోత్సహించండి-గవర్నర్ డాక్టర్ తమిళిసై

Governer::ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఈరోజు రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పాల్లొన్నారు. ముందుగా గవర్నరు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్త దాతలను అభినందించి, వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, రక్తదానం పట్ల అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించడం అత్యంత ఆవశ్యకమని గవర్నర్ స్పష్టం చేశారు. రక్తదానం అంటే జీవన దానమే అని గవర్నర్ అన్నారు. అదేవిధంగా సిపిఆర్ పై కూడా ప్రజలలో అవగావన కల్పించాలని గవర్నర్ సూచించారు.
రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరిస్తూ రక్త దానాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

ప్రతిఒక్కరు సంవత్సరంలో ఒకసారైనా రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదాతలు కావాలని కోరారు.
ఈ సందర్భంగా గవర్నరు వివిధ శాఖలకు చెందిన అత్యదికసార్లు రక్తదానం చేసిన రక్త దాతలు మరియు రక్తదాన ప్రచారకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ టు గవర్నరు కె. సురేంద్రమోహన్, రెడ్ క్రాస్ తెంలంగాణ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ అజయ్ మిశ్రా, గవర్నర్ గారి జాయింట్ సెక్రటరీలు సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img