Homeహైదరాబాద్latest Newsమాట నిలుపుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ

మాట నిలుపుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ

ఇదేనిజం,వెల్గటూర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ మాటను ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిలబెట్టుకున్నారు.. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామపంచాయతీ పరిధిలోని శాలపల్లి గ్రామంలో ఐట్ల రాములు అనే వ్యక్తి తనకు జరిగిన ప్రమాదంలో వెన్నుపూస పూర్తిగా దెబ్బతిన్నది, ఇట్టి విషయాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా శాలపల్లె గ్రామానికి ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాగ, స్థానిక ఎంపీటీసీ రంగు తిరుపతి ఆయనకు విషయం తెలియజేశారు.. ఆరోజు ఇచ్చిన మాట సందర్భంగా బాధితునికి వీల్ చైర్, తన కూతురు పై చదువులని నిమిత్తం కరీంనగర్ లోని ఆల్ ఫోర్స్ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఖర్చులు మొత్తం ఎమ్మెల్యే చెల్లించారు. ఈ సందర్భంగా మాట ఇచ్చి మాట మీద కట్టుబడి ఉన్నందుకు రాములు కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img