Homeహైదరాబాద్latest Newsటెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ : Telangana Congress

టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ : Telangana Congress

– డీఎస్సీకి ముందే నిర్వహించాలని నిర్ణయం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డీఎస్సీకి ముందే టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్‌ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ జారీ చేయనుంది. వీలైనంత ఎక్కువ మందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 11 వేల 062 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ (టీఎస్ డీఎస్సీ 2024) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img