Homeహైదరాబాద్latest Newsగుంటూరు కారం నుంచి ఏడో పాట విడుదల : Guntur Kaaram

గుంటూరు కారం నుంచి ఏడో పాట విడుదల : Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నది. కేవలం సూపర్ స్టార్ మహేశ్​బాబు ఇమేజ్ తోనే మూవీకి ఆ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో ఎక్కడగా కూడా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ కనిపించలేదని సినీ విశ్లేషకులు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి రెండు నెలలు అవుతోంది. ఓటీటీలో కూడా మూవీ రిలీజ్ అయిపొయింది. డిజిటల్ ఆడియన్స్ ని కొంత వరకు ఈ మూవీ మెప్పించింది. అయితే ఈ సినిమాకి సంబందించిన ఇంట్రెస్టింగ్​ న్యూస్ ఇప్పుడు ఒకటి తెరపైకి వచ్చింది. ‘గుంటూరు కారం’ నుంచి ఏడో సాంగ్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందంట. మూవీ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత, ఆడియన్స్ కూడా సినిమా గురించి పూర్తిగా మరిచిపోయిన తర్వాత సాంగ్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారనేది క్లారిటీ లేదు. అయితే సినిమా చరిత్రలోనే ఇలా చేయడం మొదటి సారి అనే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా మూవీ రిలీజ్ అయ్యి రెండు నెలల తర్వాత సాంగ్స్ రిలీజ్ చేసే ప్రయత్నం చేయలేదు. మరి ఈ సాంగ్ ఏ మేరకు ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్నతో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఒప్పుకున్న కమర్షియల్ యాడ్ షూట్స్ కూడా కంప్లీట్ చేసి మొత్తం మూడేళ్ళ పాటు రాజమౌళి సినిమా కోసం వెచ్చించనున్నాడంట. మూవీలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

Recent

- Advertisment -spot_img