Half day schools: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఒంటిపూట బడుల షెడ్యూల్ను తాజా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూళ్లలో ఈ టైమింగ్స్ కొనసాగుతాయని తెలిపింది.