Homeహైదరాబాద్latest Newsఅయోధ్య రామయ్యకు 'హను-మాన్' విరళం : Tollywood

అయోధ్య రామయ్యకు ‘హను-మాన్’ విరళం : Tollywood

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్’. అమృతా అయ్యర్ కథానాయిక వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా విడుదలకు ముందే చెప్పిన మాటను ‘హను-మాన్’ చిత్ర బృందం నిలబెట్టుకుంది. టికెట్పై రూ.5 చొప్పున వచ్చిన రూ.2,66,41,055 విరాళంగా ఇస్తున్నట్లు చెప్పింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించినట్లుగా అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ 53,28,211 టికెట్లు అమ్ముడు కాగా.. ‘హనుమాన్ ఫర్ శ్రీరామ్’ అని పేర్కొంటూ ఈ వివరాలను బహిర్గతం చేసింది. చిత్రబృందంతోపాటు, నిర్మాత నిరంజన్ రెడ్డిని సినీ ప్రియులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img