వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. హర్లీన్ డియోల్ (115) ఓపెనర్ స్మృతి మంధాన (53) ప్రతీకా రావల్ (76) అదరగొట్టడంతో 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. వన్డేల్లో భారత మహిళల జట్టుకు 350కిపైగా స్కోరు చేయడం ఇది రెండోసారి. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, జైదా జేమ్స్, క్వినా జోసెఫ్, డాటిన్ తలో వికెట్ తీశారు.