దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 12న జరగనుంది. ఈ వివాహానికి వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. తాజాగా వీరి పెళ్లి పత్రిక వీడియో వైరల్ అవుతోంది. పెట్టె తెరవగానే ‘ఓం’ అనే మంత్రం వినిపిస్తుంది. వెండితో చేసిన గుడి అది.. లోపల వినాయక, దుర్గ, విష్ణువుల విగ్రహాలు ఉన్నాయి. స్వయంగా అంబానీ కుటుంబమే అతిథులకు వీటిని అందజేస్తోంది.