నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ఏపీకి కాబోయే సీఎం ఎవరో తేల్చి చెప్పేశారు. రఘురామకృష్ణ శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి ఏపీలో కచ్చితంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబే ఏపీకి కాబోయే సీఎం అని రఘురామ జోస్యం చెప్పారు. కూటమి సీట్ల కేటాయింపులో తప్పిదాలను సరి చేసుకుంటే మరిన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎంపీ రఘు రామకృష్ణ అన్నారు.